News December 22, 2025
నేడు విజయవాడలో PGRS కార్యక్రమం

ఎన్టీఆర్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నటల్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News December 23, 2025
క్యాబినెట్ భేటీ వాయిదా

AP: ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. 29వ తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజు సీఎం అధ్యక్షతన 10.30amకు సచివాలయం మొదటి బ్లాకులో భేటీ జరగనుంది. మరోవైపు ఈ నెల 28న CM చంద్రబాబు అయోధ్య వెళ్లనున్నారు. 11.20amకు రామజన్మభూమి కాంప్లెక్స్కు చేరుకొని 2.30pm వరకు శ్రీరాముడిని దర్శించుకుంటారు. అనంతరం ఉండవల్లిలోని నివాసానికి తిరుగుపయనమవుతారు.
News December 23, 2025
ఊట్కూర్: ప్రజాసేవకు తొలి అడుగు.. మాతృత్వానికి శుభారంభం

ఊట్కూర్ నూతన సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన రోజే రేణుక భరత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం ఉదయం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆమె, సాయంత్రం తల్లయ్యారు. ఒకే రోజు అటు నాయకత్వ బాధ్యత, ఇటు మాతృత్వపు ఆనందం పొందడం అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ వార్తతో గ్రామంలో ఆనందం వెల్లివిరియగా, ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.
News December 23, 2025
NGKL: రైతులు ALERT.. ఫోన్ చేయండి!

నాగర్ కర్నూల్ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు “Way2News” ప్రతినిధితో తెలిపారు. మధిర మినుము-1 (MBG-1070) రకం ఫౌండేషన్ విత్తనం. విత్తన ధర Rs.180/- కిలో, వివరాలకు 94944 31405, 99126 04549, తెలంగాణ సోనా (RNR-15048) రకం వరి ఫౌండేషన్ విత్తనం. 15 కి.లో. బస్తా ధర Rs. 1155/-. వివరాలకు: 94944 31405, 99126 04549లకు సంప్రదించాలన్నారు.


