News January 23, 2026

నేడు విద్యా సామగ్రిని పూజిస్తే..?

image

వసంత పంచమి జ్ఞానానికి సంకేతం. అందుకే విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులని సరస్వతీ దేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. తద్వారా చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని, విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని నమ్మకం. అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు ఇది శ్రేష్టమైన సమయం. చదువుకునే వారే కాకుండా, మేధోవృత్తుల్లో ఉన్నవారు కూడా తమ వృత్తికి సంబంధించిన డైరీలు, పరికరాలను పూజిస్తే ఆ ఏడాది అంతా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది.

Similar News

News February 21, 2026

ఆరోగ్యకరమైన జుట్టుకు చిలగడదుంప

image

చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని ఇది అడ్డుకుంటుంది. చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, సి, బి, ఇ, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

News February 21, 2026

REWIND: ఆ విషాదానికి 13 ఏళ్లు

image

నేటితో 2013 హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు. ఆ చీకటి రోజును ఒక్కసారి రివైండ్ చేసుకుంటే.. దిల్‌సుఖ్‌నగర్ రక్తసిక్తమైన దృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి. ఉగ్రవాదులు సైకిళ్లపై అమర్చిన బాంబుల ధాటికి 18మంది బలవ్వగా 131మంది గాయపడ్డారు. ఇది భాగ్యనగరానికి ఒక మాయని మచ్చ. ఈ కేసులో ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రవాదులకు కోర్టు మరణశిక్ష విధించింది. నగరం గతాన్ని మర్చిపోయినా ఆ గాయం మాత్రం ఇంకా పచ్చిగానే ఉంది.

News February 21, 2026

మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

image

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.