News January 15, 2025

నేడు వేములపల్లికి ఎమ్మెల్యే

image

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం వేములపల్లి మండల కేంద్రంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమనగల్లు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో అభివృద్ధి పోస్టర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News October 31, 2025

NLG: 61, 511 ఎకరాల్లో పంట నష్టం

image

‘మొంథా’ జిల్లాలో రైతులను నిలువునా ముంచింది. వర్షం కారణంగా వరి, పత్తి, మిర్చి పంటలు, రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. 310 గ్రామాల్లో 30,359 మంది రైతులకు చెందిన 61,511 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం 33 శాతం పైబడి పంట నష్టపోయిన వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.

News October 31, 2025

NLG: నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ

image

సికింద్రాబాద్ నుంచి BNG మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మొంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. డోర్నకల్లో వరద నీరు ఉండడంతో ఆయా రైళ్లను NLG రైలు మార్గం గుండా వెళ్లేందుకు మళ్లించారు. తెలంగాణ, దక్షిణ ఎక్స్ప్రెస్ రైళ్లు BNG మీదుగా వెళ్లే అవకాశం ఉంది.

News October 31, 2025

నల్గొండ జిల్లాలో 30.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం

image

మోంథా కారణంగా జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 30.4 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కురిసింది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 130.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. చిట్యాల 44.1, నార్కట్పల్లి 41.5, కట్టంగూరు 41.1, నకిరేకల్ 54.5, కేతేపల్లి 56.7, మునుగోడు 36.3, చండూర్ 36.3, మర్రిగూడ 49.1, నేరెడుగొమ్ము 36.0, 37.6, దేవరకొండ 47.0, చందంపేట 46.0, గట్టుప్పల్లో 47.0 మిల్లీమీటర్లు రికార్డ్ అయ్యింది.