News March 30, 2025

నేడు సన్నబియ్యం పథకం ప్రారంభం.. ఫస్ట్ వీరికే!

image

రాష్ట్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్‌నగర్‌ వేదికగా CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొదటగా పట్టణంలోని రేషన్ కార్డుదారులు ధరావత్ బుజ్జీ, కర్ల రాధ, రజిత, సుశీల, షేక్ కరీమా, మమత, సుగుణ, కర్నా వెంకటపుష్ప, సరికొండ ఉమ, మండల పరిధిలోని చడపండు లక్ష్మి, భరతం కుమారి, కర్పూరపు లక్ష్మి, మాళోతు రంగా, గుండెబోయిన గురవయ్య, షేక్ రహిమాన్‌కు CM రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.

Similar News

News November 2, 2025

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి: కలెక్టర్ ఇలా

image

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె తిప్పర్తి(M) చిన్న సూరారం గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

News November 1, 2025

శిశు విక్రయాలు, లైంగిక దాడులపై కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నల్గొండ జిల్లాలో ఆడబిడ్డల రక్షణకై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థినులపై లైంగిక దాడులు వంటి వాటిని అరికట్టడంలో అన్ని సంక్షేమ శాఖలు, ఆర్.సీ.ఓ.లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ దుశ్చర్యలకు పాల్పడితే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 1, 2025

చిన్నసూరారం ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తూకాలు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, బస్తాలు, పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.