News February 22, 2025
నేడు సిద్దిపేటకు కీలక నేతల రాక..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల సత్తా చాటుతామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షులు ఇమామ్ అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. సిద్ధిపేటలోని ఓ గార్డెన్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శనివారం సభ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అసెంబ్లీ కోఆర్డినేటర్ అద్దంకి దయాకర్ హాజరవుతారని తెలిపారు.
Similar News
News November 7, 2025
హైవేపై 10 కి.మీ రన్నింగ్ చేసిన గోరంట్ల మాధవ్

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ శుక్రవారం ఉదయం రాయదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై రన్నింగ్ చేశారు. రాయదుర్గం నుంచి మారెంపల్లి వరకు సుమారు 10 కి.మీ దూరం ఆయన పరిగెత్తడం చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో సీఐగా పనిచేసిన ఆయన ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రాయదుర్గంలో ఓ వివాహ వేడుకకు వచ్చిన ఆయనను స్థానిక వైసీపీ నేత, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ తదితరులు కలిసి ముచ్చటించారు.
News November 7, 2025
సంగారెడ్డి: వరి కోత మిషన్లో యువకుడి కాలు నుజ్జునుజ్జు

నారాయణఖేడ్ మండలం సంజీరావుపేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి వరి కోత కోస్తున్న యువకుడి కాలు హార్వెస్టర్ మిషన్ లోపల పడి నుజ్జునుజ్జయింది. వెంటనే రైతులు గమనించి బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలు తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 7, 2025
KNR: అధికారుల కక్కుర్తి.. ‘డీజిల్ BILLSలో చేతివాటం’

KNR మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా వాహనాల నిర్వహణకు రూ.2 కోట్లకుపైగా డీజిల్పై ఖర్చు చేస్తుంటారు. కాగా డీజిల్ డబ్బులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా ఆయా విభాగాల అధికారులు తమ సొంతవాహనాల్లో మున్సిపల్ డీజిల్ వాడుతూ అద్దెవాహనాల కింద బిల్లులు డ్రా చేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అలాగే మున్సిపల్ వాహనాల్లో ఒక ట్రిప్ వేసి రెండు ట్రిప్పుల బిల్లులు రికార్డు చేస్తున్నట్లు సమాచారం.


