News October 6, 2025
నేడు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రధాన ఉత్సవం: కలెక్టర్

స్వఛ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 2 అవార్డులు వచ్చినట్లు చెప్పారు. ఇందులో స్వచ్ఛ్ హాస్టల్ నేలబొంతు గ్రామానికి చెందిన ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కు, శ్రీకాకుళం చెందిన శ్రీ గౌరీ శంకర్ మహిళా సంఘానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో 14 క్యాటగిరిలలో 46 అవార్డులు లభించినట్లు ఆయన వివరించారు.
Similar News
News October 6, 2025
సోంపేటలో ఏపీ పుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

సోంపేట మండలం బారువ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏపీ పుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. భోజనాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చెశారు. అనంతరం వార్డెన్ రవికుమార్ను అభినందిస్తూ సన్మానం చేశారు. ఈ తనిఖీలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి డీడీ మధుసూదనరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి పాల్గొన్నారు.
News October 6, 2025
శాంతించిన వంశధార..!

ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వంశధారకు వరద పోటెత్తింది. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్యలకు పైగా నీరు నదిలో ప్రవహించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వంశధారలో 29,224 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీ 22 గేట్లను కాస్త లిఫ్ చేసి దిగువ ప్రాంతానికి నీరు విడిచి పెడుతున్నట్లు వంశధార డీఈ సరస్వతి వెల్లడించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ప్రవాహం లేదు.
News October 6, 2025
ఉద్దానంలో ఎయిర్పోర్ట్.. మీరేమంటారు?

ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే దానికి అనుబంధంగా 140సంస్థలు వస్తాయని.. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఫైలెట్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడంపై ఆలోచిస్తామన్నారు. రైతులకు నష్టం జరగకుండా భూములు తీసుకుంటామని.. కొన్నిపార్టీలు రైతులను అపోహలకు గురి చేస్తున్నారని గౌతు శిరీష అన్నారు. ఎకరాకు రూ.కోటి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్.