News August 21, 2025
నేడు హైకోర్టులో KCR, హరీశ్రావు పిటిషన్లపై విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ KCR, హరీశ్రావు 2 వేర్వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలనే వీరి పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్ట్ జడ్జి జస్టిస్ కుమార్ సింగ్ విచారించనున్నారు. దీనిపై BRSకు రిలీఫ్ వస్తుందా? లేక ఏం జరగబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News August 21, 2025
HYD: ఒక్క పిల్లర్ నిర్మాణం వెనక నెలల కష్టం

ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఒక్క పిల్లర్ నిర్మాణం వెనుక నెలల కష్టం ఉంటుందని ఇంజినీర్లు తెలిపారు. పిల్లర్ల నిర్మాణం ఇన్ సిట్యూ పద్ధతిలో అక్కడే జరుగుతుంది. పిల్లర్ల నిర్మాణంలో ఫౌండేషన్ ఒకేత్తయితే, పైభాగం(వెబ్) నిర్మాణం మరో ఎత్తు. పిల్లర్పై భాగం నిర్మాణానికి భారీ స్థాయిలో స్టీల్ అవసరం ఉంటుందని AE అనిల్ తెలిపారు.
News August 21, 2025
అత్యధికంగా సిమెంట్ వినియోగం HYDలోనే

HYD, రంగారెడ్డి శివారులో అనేక చోట్ల రెడీమిక్స్ ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా HYDలోనే అత్యధిక సిమెంట్ వాడుతున్నట్లు సివిల్ ఇంజినీరింగ్ టెక్నికల్ యంత్రాంగం గుర్తించింది. అయితే.. థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా విడుదలవుతున్న ఫ్లైయాష్ను సిమెంట్ పరిశ్రమలు తక్కువగా వినియోగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ, అటవీశాఖ సహాయక మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్డించారు.
News August 21, 2025
HYD: పాదచారి భద్రతకు FOBలు ప్రైవేట్ సంస్థలకు

మహానగర రోడ్లపై ఎటుచూసినా వాహనాలే.. పాదచారులు రోడ్డు దాటుదామంటే నరకమే..అందుకే గ్రేటర్ వ్యాప్తంగా 32 ఫుట్ ఓవర్ బ్రిడ్జి(FOB)లను గతంలో నిర్మించారు. అయితే నిర్వహణ మాత్రం గాలికొదిలేశారు. ఇపుడు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని GHMC నిర్ణయించింది. FOBల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇవి అందుబాటులోకి వస్తే నగరంలో పాదచారి కష్టాలు కాస్త తీరినట్టే.