News June 29, 2024

నేడు 15 కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని 15 కోర్టులో శనివారం 10 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు శుక్రవారం తెలిపారు. ☞ తూ.గో జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి☞ కాకినాడ జిల్లాలో కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు☞ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, ముమ్మిడివరం, కొత్తపేటలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు.

Similar News

News July 1, 2024

క్యాంపు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్

image

కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం, చేబ్రోలు హైవే పక్కన ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు కలెక్టర్ శన్మోహన్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి భరణి, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

News July 1, 2024

తూ.గో.: పవన్ కళ్యాణ్ ENTRY

image

డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. గొల్లప్రోలు మండలంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.

News July 1, 2024

తూ.గో.: పిల్లలు పుట్టడం లేదని సూసైడ్

image

తూ.గో. జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాశి (24) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దుర్గారావును ప్రేమవివాహం చేసుకుంది. కాగా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆదివారం కాలువలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.