News November 21, 2025

నేడు HYDకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. షెడ్యూల్ ఇదే!

image

> తిరుమల పర్యటన ముగించుకుని మ.1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
> అక్కడి నుంచి నేరుగా ఆమె సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి, విశ్రాంతి తీసుకుంటారు.
> మ.3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.
> సా.4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.
> సా.6:15 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.

Similar News

News November 22, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

image

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

News November 22, 2025

HYD: నేడు కార్గో వస్తువుల వేలం

image

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో పెండింగ్‌లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.

News November 22, 2025

HYD: KPHB‌‌లో విదేశీ యువతులతో వ్యభిచారం.. జైలు శిక్ష

image

KPHB PS పరిధిలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నిర్వాహకుడికి కూకట్‌పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు రిపాన్‌తో పాటు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. సివిల్ జడ్జి సంధ్యారాణి విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చారు.