News February 16, 2026

నేడే ఎన్నిక.. సంగారెడ్డి ఎస్పీ హెచ్చరిక

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపల్ కార్యాలయాల వద్ద నేడు ఆంక్షలు విధించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు కార్డులున్న కౌన్సిలర్లను మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. ఇతరులు కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News February 19, 2026

జమ్మికుంట: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,500 పలుకగా.. బుధవారం రూ.50 పెరిగి రూ.7,550 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గురువారం మార్కెట్‌కు రైతులు 34 వాహనాల్లో 244 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News February 19, 2026

పొదిలి: ఒక్కో ప్లేట్‌కు రూ.50.. మిమ్మల్నీ అడిగారా?

image

పొదిలిలో విద్యుత్ సర్వీసు నంబర్ ప్లేట్లు బిగించి ప్రతి ఒక్కరి వద్ద రూ.50 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పాత ప్లేట్ ఉన్నప్పటికీ.. తప్పనిసరిగా కొత్త ప్లేట్ పెట్టాలంటూ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా.. తమకు సంబంధం లేదని.. ప్రైవేట్ కాంట్రాక్టర్ వాటిని బిగిస్తున్నారని చెప్పారు.

News February 19, 2026

అమెరికాలో సంతమాగులూరు యువకుడి అదృశ్యం.. నెలన్నర దాటినా వీడని మిస్టరీ!

image

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో అదృశ్యమైన సంతమాగులూరు మండలానికి చెందిన కారసాని హరికృష్ణారెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డిసెంబర్ 30 తర్వాత ఆయనతో సంబంధాలు తెగిపోవడంతో 50 రోజులుగా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో అమెరికా అధికారులతో సమన్వయం చేసుకుంటూ శోధన బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.