News March 30, 2024

నేడే కామారెడ్డిలో అవిశ్వాస తీర్మానం.. తీవ్ర ఉత్కంఠ..!

image

కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి పై నేడే అవిశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. FEBలో 27మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కి అధ్యక్ష పదవిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుచేయగా ఈనెల 30న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అవిశ్వాసం నెగ్గాలంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్‌ క్యాంపులో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఏదేమైనా ఏం జరుగుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

News February 28, 2026

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.