News March 31, 2024
నేడే చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్
చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం జరిగే ఐపీఎల్ మ్యాచ్కు పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్లలో విజయం సాధించి మంచి ఊపుమీదున్న చెన్నై సూపర్కింగ్స్ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ప్రవేశ ద్వారాల వద్ద వైఫైతో కూడా స్కానర్ బోర్డులను ఏర్పాటుచేశారు. మ్యాచ్ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
Similar News
News October 4, 2024
యలమంచిలి: రూ.100 కోసం బ్లేడ్తో దాడి
అప్పుగా ఇచ్చిన రూ.100 కోసం ఓ వ్యక్తిపై పదునైన బ్లేడ్తో దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నూకిరెడ్డి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణకు రూ.100 అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాస్పై వెంకటరమణ బ్లేడ్తో దాడి చేశాడు.
News October 4, 2024
విశాఖ: ఆకాశాన్ని అంటుతున్న టమాటా ధరలు
టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 కాగా, రైతు బజార్లలో రూ.66కి విక్రయిస్తున్నారు. రాయితీపై టమాటాను విక్రయించాలని విశాఖ నగర ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వారం రోజుల కిందట కిలో టమాటా ధర రూ.66 ఉండగా అదనంగా రూ.22 పెరిగింది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు టమాటా జోలికి వెళ్లటం లేదు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
News October 4, 2024
విశాఖ: ‘డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ’
మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో పోలీస్ అధికారులు పనిచేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. విశాఖలో గురువారం న్యూఢిల్లీకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో 50 మంది పోలీస్ అధికారులకు డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ మాటాడుతూ యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.