News April 12, 2025

నేడే రిజల్ట్.. అనంతపురం విద్యార్థుల్లో ఉత్కంఠ

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవ్వాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 13, 2025

అనంత: YCP పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మాజీ ఎంపీకి చోటు

image

అనంతపురం జిల్లా వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యను నియమిస్తూ.. వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ అధ్యక్షులు YS జగన్ శనివారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. తలారి రంగయ్యకు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

News April 12, 2025

అనంత జిల్లాకు 13వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో అనంత జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 19,541 మంది పరీక్షలు రాయగా 15,632 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో అనంత జిల్లా రాష్ట్రంలోనే 13వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 22,824 మందికి 14,439 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 17వ స్థానంలో జిల్లా నిలిచింది.

News April 12, 2025

రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్

image

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేసిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్‌తో పాటు మరో ఆరుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మాధవ్ అతనిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.

error: Content is protected !!