News April 23, 2025

నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 23, 2025

ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

వేసవిలో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 90 శాతం లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయాలని చెప్పారు. మంగళవారం ఉపాధి హామీ, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాల సేవల అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో కలెక్టర్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News April 22, 2025

కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤పత్తికొండ యువతికి 990 మార్కులు➤ విషాదం.. తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ➤ రేపే పదో తరగతి రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు➤ కర్నూలు: ఆర్టీసీ బస్సులో పొగలు ➤ కర్నూలు జిల్లాలో ఆశాజనకంగా పత్తి ధరలు➤ కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరికలు➤ ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు➤ గూడూరులో ఇద్దరు కార్మికుల మృతి➤ డిప్యూటీ డీఈవోగా ఐజీ రాజేంద్రప్రసాద్ బాధ్యతలు

News April 22, 2025

పత్తికొండ యువతికి 990 మార్కులు

image

పత్తికొండ పట్టణంలోని అరుంధతి నగర్‌కు చెందిన వడ్డే రాజగోపాల్, అనిత దంపతుల కుమార్తె నేహ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో చదివిన యువతి బైపీసీలో 990/1000 మార్కులు సాధించారు. దీంతో అధ్యాపకులు, తల్లిదండ్రులు, స్నేహితులు యువతిని అభినందించారు.

error: Content is protected !!