News March 15, 2025

నేడే విజయనగరంలో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక మహారాజ అటానమస్ కాలేజీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. మిరాకిల్ సాప్ట్‌వేర్ సిస్టంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకాం, BBA, MBA, MCA, MSC, BCA చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. >Share It

Similar News

News March 17, 2025

గుర్లలో నకిలీ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులు

image

గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. పలువురు అధికారులకు ఆదివారం ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడుతున్నారని, అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుర్ల SI నారాయణరావు తెలిపారు.

News March 17, 2025

విజయనగరం జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, L కోట, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం,సంతకవిటి, తెర్లాం, వంగర, S కోట మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 17, 2025

VZM: ఆరుగురిపై కేసు నమోదు

image

ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై విజయనగరం జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టి వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆదివారం సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం శివారులో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై రాజాం పోలీసులు దాడులు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆరుగురు మందుబాబులపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!