News March 3, 2025

నేడే MLC ఫలితం.. సర్వత్రా ఉత్కంఠ..!

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విశాఖ AU ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ప్రధానంగా పోటీలో కూటమి బలపరిచిన రఘువర్మ(APTF),PDF తరఫున విజయగౌరి, PRTU తరుఫున శ్రీనివాసులునాయుడు ఉన్నారు. వీరిలో గురువురులు ఎవరికి పట్టం కట్టారో మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

Similar News

News September 17, 2025

చందన్ వల్లి-కొడంగల్ రేడియల్ రోడ్డు: CM

image

ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో కొత్తగా రేడియల్ రోడ్లు వేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విస్తరణలో ప్రజలకు, రైతులకు నష్టం జరగకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం ఉంటుందని తెలిపారు. పరిశ్రమల కల్పవల్లి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్ వల్లి నుంచి కొడంగల్ వరకు 70 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణం త్వరలో చేపడతామని ప్రజాపాలన వేడుకల్లో సీఎం వెల్లడించారు.

News September 17, 2025

EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: EC

image

ఈవీఎంలపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయంలో మెషీన్లపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంచనున్నట్లు తెలిపింది. బిహార్ ఎన్నికల నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను మరింత సులభంగా ఎన్నుకోవచ్చు. ఈవీఎం ప్యానెల్‌లో క్రమసంఖ్య, అభ్యర్థి పేరు, కలర్ ఫొటో, గుర్తు వరుసగా ఉంటాయి. ఇప్పటివరకు అభ్యర్థుల పేర్లు, పక్కన వారి సింబల్స్ ఉండేవి.

News September 17, 2025

ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,000 డ్రైవర్, 743 శ్రామిక్(మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్‌రైట్ మెకానిక్) పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.