News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
Similar News
News December 12, 2025
కొండంత లక్ష్యం.. నంబర్-3లో అక్షర్ పటేలా?

SA 2వ T20లో 214 పరుగుల భారీ లక్ష్యం ముందు ఉంచితే, IND జట్టు ఫాలో అయిన స్ట్రాటజీ వింతగా ఉందని క్రీడా వర్గాలు విమర్శిస్తున్నాయి. గిల్ తొలి ఓవర్లోనే ఔటైతే SKYకి బదులు అక్షర్ నం.3లో రావడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సూర్య కాకపోయినా తిలక్, హార్దిక్, జితేశ్ ఉండగా ఈ మూవ్ ఏంటో అంతుచిక్కడం లేదని అభిప్రాయపడుతున్నాయి. తొలి బంతి నుంచే తడబడిన అక్షర్ 21బంతుల్లో 21పరుగులే చేసి వెనుదిరిగారు. దీనిపై మీ COMMENT.
News December 12, 2025
వరి నాట్లు వేసేటప్పుడు జాగ్రత్తలు(1/2)

వరి నారుమడి నుంచి నారు తీసే వారం రోజుల ముందు.. ఎకరానికి సరిపడా నారుమడికి కిలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేసి నీరు పెట్టి ఇంకించాలి. దీని వల్ల పొలంలో నెలవరకూ పైరును పురుగులు ఆశించవు. వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. నారుమడి నుంచి పెరికిన నారు కట్టలను నానో DAP ద్రావణంలో(లీటరు నీటికి 4ml) 15 నిమిషాలు ముంచి నాటితే పొలంలో పైరు తొందరగా వేర్లు తొడిగి నాటుకుంటాయి.
News December 12, 2025
టెన్త్ అర్హతతో 714 పోస్టులకు నోటిఫికేషన్

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (<


