News November 27, 2024

నేమకల్లులో పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం

image

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యటించారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు నేమకల్లు గ్రామంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలీ ప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు.

Similar News

News September 15, 2025

ఇంజినీర్లకు దారి చూపిన గురువు!

image

అనంతపురం JNTUలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుదర్శన రావు ఎంతో మంది యువకులను ఉత్తమ ఇంజినీర్లుగా తీర్చిదిద్దారు. ఆయన గతంలో AEE ఉద్యోగం వదిలేసి టీచింగ్‌ను ఎంచుకున్నారు. తన అసాధారణమైన బోధనతో ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఆయన స్టూడెంట్స్ AE, AEEలుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇండియాలోని బెస్ట్ టీచర్లలో ఆయన ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
#EngineersDay2025

News September 15, 2025

గుత్తిలో రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్

image

గుత్తిలో ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గౌతమీపురి ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుత్తి ఆర్ఎస్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల జట్లు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

News September 14, 2025

లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో అనంతపురం MPకి 8ర్యాంక్

image

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదికలో అనంతపురం MP అంబికా లక్ష్మీనారాయణ 8వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 78 ప్రశ్నలు అడగగా, 8 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 89.71గా ఉంది. ఆయన పనితీరుపై మీ కామెంట్..!