News March 30, 2024
నేరడిగొండ: కొడుకు వేధింపులు.. తండ్రి సూసైడ్

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు వేధింపులు తాళలేక తండ్రి ఆత్మహత్యే చేసుకున్నాడు. నేరడిగొండ మండలం రాజుల తండాకు చెందిన నూరిసింగ్ (60)కు ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు అంకుశ్ పెళ్లి చేసుకొని విడిగా ఉంటున్నాడు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ తండ్రిని నిత్యం వేధించేవాడు. దీంతో నూరిసింగ్ పొలం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Similar News
News February 28, 2025
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పై పాటను స్వరపరిచిన కైలాష్

కృత్రిమ మేధాతో అద్భుతాలు సృష్టిస్తున్న తొడసం కైలాష్ తాజాగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పైన “ఎంత మంచివాడమ్మ మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్” అనే పాటను కంపోజ్ చేసి పాడించారు. తొడసం కైలాష్ మాట్లాడుతూ.. తన యూట్యూబ్ ఛానల్ లో ఈ పాట అందరికి అందుబాటులో ఉంచానని, చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నదని తెలిపారు. కింది లింక్ ద్వారా పాటను వినవచ్చు.
News February 27, 2025
ఆదిలాబాద్: కనిపించకుండాపోయి.. శవమై తేలి

ఓ వ్యక్తి కనపడకుండా పోయి శవమై తేలిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ వన్ టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. ఖానాపూర్కు చెందిన సాయికుమార్ (28) ఈనెల 22 నుంచి కనపడడం లేదని సోదరుడు గణేశ్ 25న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఖానాపూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా గురువారం శవమై కనిపించాడు. కుడి కన్నుకు ఆపరేషన్ కాగా కన్ను నుంచి నీరు, చీము కారుతుందని అది భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.
News February 27, 2025
ADBలో ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు: SP

ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNNS యాక్ట్ (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. 100-200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించడానికి చూసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా తిరగడం, పార్టీ జెండాలను పార్టీ గుర్తులను ధరించకూడదని హెచ్చరించారు.