News December 30, 2025
నేర నియంత్రణలో జిల్లా పురోగతి సాధించింది: ఎస్పీ

మహిళల భద్రత, ప్రజా రక్షణకు ప్రాధాన్యం ఇచ్చి బాపట్ల జిల్లా పోలీస్ శాఖ నేర నియంత్రణలో గణనీయ పురోగతి సాధించిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. 2025లో జిల్లాలో నమోదైన నేరాలు గతేడాదితో పోలిస్తే 15 శాతం తగ్గాయన్నారు. వేగవంతమైన దర్యాప్తు, ముందస్తు చర్యలు, సీసీ కెమెరాల వినియోగం, రౌడీల కౌన్సిలింగ్ వల్ల నేరాల తీవ్రత తగ్గిందని వివరించారు.
Similar News
News December 30, 2025
ప్రగతి పథంలో విశాఖ విమానాశ్రయం

విశాఖ విమానాశ్రయం 2025లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య 27 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల దేశీయ సరకు రవాణా చేశారు. గత ఏడాదితో పోలిస్తే విమానాశ్రయ కార్యకలాపాల్లో 9.29% వృద్ధి నమోదైంది. కస్టమర్ సంతృప్తి విషయంలో దేశవ్యాప్తంగా విశాఖ విమానాశ్రయం 9వ స్థానంలో నిలిచింది.
News December 30, 2025
వరంగల్: నామినేటెడ్ పదవులపై నేతల్లో ఆశలు..!

పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల రద్దుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ కోలాహలం నెలకొంది. ఈ నెల 19న వచ్చిన ఉత్తర్వులు ఆశావహుల్లో ఉత్సాహం నింపాయి. జిల్లాలో 99 పీఏసీఎస్లు ఉండగా వాటి సంఖ్య పెంచే యోచన ఉంది. డీసీసీబీ ఛైర్మన్ పదవులు ఒకటి నుంచి ఆరుకు పెరిగే అవకాశం. ఈసారి ఎన్నికల బదులు నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయనుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
News December 30, 2025
సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లో పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆమె భరోసా కల్పించారు. యూరియాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.


