News February 14, 2026
నేలలో అధిక తేమ వల్ల పంటల్లో కనిపించే సమస్యలు

నేలలో అధిక తేమ వల్ల కూరగాయల తోటల్లో నారుకుళ్లు, మొక్క ఎదుగుదల తగ్గటం, పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు, ఆకులు పసుపుబారటం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు.. ఆకుకూరల్లో మొక్క మొదలుకుళ్లు, ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. దుంప జాతుల్లో దుంప కుళ్లు, అధిక శాఖీయోత్పత్తి సమస్యలు కనిపిస్తాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ, మామిడిలో అధిక తేమ ప్రభావం ఎక్కువ.
Similar News
News February 17, 2026
IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు

<
News February 17, 2026
కుటుంబ కలహాలు తొలగేందుకు పరిహారాలు

కుటుంబంలో ప్రశాంతత కోసం వాస్తు నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. వాటి ప్రకారం.. ప్రతికూల శక్తిని పోయేందుకు ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కకు నిత్యం నీరు పోయాలి. అదే దిశలో రాగి/ఇత్తడి బిందెతో నీటిని ఉంచాలి. దృష్టి దోషాలు పోవాలంటే దక్షిణాన పంచముఖ ఆంజనేయ ఫోటోను ఉంచాలి. అలాగే లక్ష్మీ గణపతి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సానుకూల శక్తితో ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది.
News February 17, 2026
మొక్కల పెరుగుదలలో పోషకాల పాత్ర కీలకం

☛ యూరియా: మొక్కల్లో ఆకుల పెరుగుదల, కాండం వృద్ధి, పచ్చదనానికి కారణమవుతుంది. ☛ భాస్వరం: మొక్కల వేర్ల అభివృద్ధికి అవసరం ☛ పొటాష్: మొక్కల ఆరోగ్యం, గింజలు, కాయల నాణ్యతలో కీలక పాత్ర పోషిస్తుంది.
☛ ఇక జింక్, ఇనుము, బోరాన్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలు తక్కువ పరిమాణంలో అవసరమైనా పంటలకు చాలా కీలకం. ఇవి పూత రాలిపోకుండా, కాయలు సక్రమంగా ఏర్పడేలా చేస్తాయి. మొక్కల అంతర జీవక్రియలు సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.


