News December 27, 2025

నేషనల్ వాటర్ పోలో పోటీలకు సంగారెడ్డి విద్యార్థి

image

జాతీయస్థాయి వాటర్ పోలో పోటీలకు సంగారెడ్డికి చెందిన మహమ్మద్ రెహమాన్ ఎంపికయ్యారు. ఈ నెల 27 నుండి 29 వరకు హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్, వాటర్ పోలో పోటీలలో ఆయన పాల్గొంటారని రాష్ట్ర కార్యదర్శి ఉమేష్ శుక్రవారం తెలిపారు. రెహమాన్ జాతీయస్థాయిలోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు.

Similar News

News December 28, 2025

తూ.గో: నది మింగిన నవ్వులు.. రోడ్డుపై రక్తపు మరకలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాను 2025 ఏడాది వరుస ప్రమాదాలు ఉలిక్కిపడేలా చేశాయి. మే‌లో ముమ్మిడివరం వద్ద నదిలో స్నానానికి వెళ్లిన 8మంది యువకులు చనిపోగా, జూన్‌లో రంగంపేట సమీపాన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. అక్టోబరులో రాయవరం బాణసంచాలో జరిగిన భారీ పేలుడు ఏడుగురిని బలితీసుకుని అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలు అనేక కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని నింపాయి.

News December 28, 2025

చిత్తూరు జిల్లాకు మరో 25,592 ఇళ్లు.!

image

PMAY పథకం కింద <<18682670>>చిత్తూరు<<>> జిల్లాకు 25,592 పక్కా గృహాలు అవసరమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో అత్యధికంగా పలమనేరుకు 9,651, కుప్పంకు 6,986, పుంగనూరుకు 2726, GD నెల్లూరుకు 2319, పూతలపట్టుకు 1905, నగరికి 1332, చిత్తూరుకు 671 పక్కా గృహాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ అవసరాలకు అనుగుణంగా దశలవారీగా పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు.

News December 28, 2025

ఈ ఏడాది 57 పోక్సో కేసులు నమోదు: VZM ఎస్పీ

image

విజయనగరం జిల్లాలో పోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. 2024లో 58 కేసులు నమోదుకాగా.. 2025లో 57 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడంతో నిందితులకు కఠిన శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, 2 కేసుల్లో 25 సంవత్సరాలకు పైగా, 11 కేసుల్లో 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్షలు విధించబడ్డాయని వివరించారు.