News January 31, 2026

‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

image

TG: మున్సిపల్ ఎన్నికలతో ఇన్నాళ్ల మొండి బకాయిలు వసూలవుతున్నాయి. ఎలక్షన్స్‌లో పోటీ చేసే అభ్యర్థులకు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వారంతా పెండింగ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. నిజామాబాద్ 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శమంతనరేందర్ తమ వంశీ హోటల్‌కు సంబంధించి ఏకంగా రూ.7.50కోట్ల ఆస్తిపన్ను కట్టారు. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.50 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు.

Similar News

News February 4, 2026

సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు: KTR

image

TG: సీఎం రేవంత్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన ఆరోపణలు చేశారు. ‘KLSR అనేది సీఎం రేవంత్ బినామీ కంపెనీ. రేవంత్ వాడుతున్న కారు కూడా ఈ సంస్థ పేరు మీదే ఉంది. 2018లోనే ఈ కంపెనీపై IT దాడులు జరిగాయి. 2023లో దివాళా తీసింది. వాళ్ల దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకూ డబ్బులు లేవు. అలాంటి కంపెనీకి రూ.6వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నోటీసులూ ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

News February 4, 2026

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హతగల వారు FEB 16వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.10వేలు, అటెండెంట్‌కు రూ.6వేలు చెల్లిస్తారు. సైట్: eastgodavari.dcourts.gov.in

News February 4, 2026

భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

image

AP: క్యాన్సర్… రోగుల్ని, వారి ఫ్యామిలీలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈ క్యాన్సర్ కేసులు APలో భారీగా పెరుగుతున్నాయి. 2021-2025 మధ్య 1.6L కేసులు తేలాయి. గ్రామీణ, చిన్న పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోగుల్లో 65% మహిళలే. వీటి వైద్యంలో 12.6 లక్షల ఎపిసోడ్స్(చికిత్స)లు నమోదు కాగా ₹3061CR ఖర్చయినట్లు అంచనా. దీనిపై సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు GOVTకి నివేదిక ఇచ్చారు.