News August 17, 2024
న్యాయమూర్తులతో వర్చువల్ సమావేశం నిర్మించిన జిల్లా జడ్జి

శ్రీకాకుళం జిల్లా కోర్ట్ ఆవరణలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా జిల్లాలో గల న్యాయమూర్తులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14న జరగబోయే లోక్ అదాలత్ కక్షిదారులకు ఒక మంచి అవకాశం అని, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను, సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులను ఎక్కువ చేయాలని అతను కోరారు. కార్యక్రమంలో సన్యాసినాయుడు, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2026
శ్రీకాకుళం: నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

ఆకాశవాణి.. అంటూ గగనతలం నుంచి సాగిన అదృశ్యవాణి ఒక తరానికి తీరని జ్ఞాపకం. టీవీలు, సెల్ ఫోన్లు రాకముందు రేడియో ఒక అద్భుతమైన స్నేహితుడు. పాటలు, కథలు, న్యూస్, వినోదం ఇలా ఎన్నో రకాల సేవలు అందించే ఈ రేడియో నేటి తరానికి తెలియదు. సమాచార విప్లవం తర్వాత కూడా ఎఫ్.ఎమ్ అంటూ సందడి చేసింది. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం.
News February 13, 2026
మందస: రాజవంశీయుడు కన్నుమూత

మందస రాజవంశీయులు కేసరి సింగ్ దేవ్ (79) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఖార్వేలా నగర్లో స్వగృహంలో కన్నుమూశారు. కేసరి సింగ్ దేవ్ గతంలో టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈయన మృతితో మందసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంస్థానానికి చివరి రాజు అయిన రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడే కేసరి సింగ్ దేవ్.
News February 13, 2026
తెల్లవారుజామున 3 గం.ల నుంచే శ్రీముఖలింగేశ్వరుడి దర్శనాలు

జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 15-18 వరకు జరగన్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గం.లకు సుప్రభాత సేవ నిర్వహించి, 3 గం.ల నుంచే స్వామి దర్శనం భక్తులకు కల్పిస్తామని ఈవో కొండలరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 7 గం.లకు శిఖర దీపం, 10గం.లకు లింగోద్భవం, అర్ధరాత్రి 12 గం.లకు తిరువీధి కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను చేశామన్నారు.


