News March 5, 2026
న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఆపేందుకు రెడీ.. కాకపోతే: ఇరాన్

US, ఇజ్రాయెల్తో యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మజీద్ తఖ్త్ రావంచి కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ ప్రోగ్రామ్ను ఆపేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కానీ తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్ ఇవ్వాలని కండీషన్ పెట్టారు. అయితే ఇది తాజా ఆఫర్ కాదని, అమెరికాతో జరిపిన గత చర్చలకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ IRNA చెప్పుకొచ్చింది.
Similar News
News March 5, 2026
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.
News March 5, 2026
3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News March 5, 2026
US దాడి చేస్తే ఇండియాపై నిందలేంటి: అమిత్ మాలవీయ

ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఇండియాను నిందించడంలో లాజిక్ లేదని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘భారత తీరానికి 250 నాటికల్ మైళ్ల దూరంలో, సముద్ర పరిధికి అవతల అటాక్ జరిగింది. సమీపంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఘటనకు ఆ దేశం బాధ్యత వహించదు. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలను IND నియంత్రించదు. US-ఇరాన్ మధ్య జరిగిన దానికి ఇండియాను జవాబుదారీగా చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని ట్వీట్ చేశారు.


