News December 31, 2025
న్యూ ఇయర్.. 72 వాహనాలు సీజ్: VKB SP

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు తనిఖీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,895 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేకుండా, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Similar News
News January 3, 2026
రేపే భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్

AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రేపు నెరవేరనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి వ్యాలిడేషన్ ఎయిర్ ఇండియా విమానం ల్యాండవనుంది. అందులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు ప్రముఖులు భోగాపురం చేరుకుంటారు. ఇప్పటికే విమానాశ్రయంలో ATC సెంటర్లు, రన్వే దాదాపుగా పూర్తయ్యాయి. ‘అనుమతుల నుంచి నిర్మాణం వరకు జగన్ హయాంలోనే జరిగింది. క్రెడిట్ మాత్రం బాబు తీసుకుంటున్నారు’ అని YCP విమర్శలు గుప్పిస్తోంది.
News January 3, 2026
పాపం చిలుకలు.. ప్రేమగా వేసిన గింజలు తిని!

చూడముచ్చటైన చిలుకల కిలకిలరావాలతో అలరారే నర్మదా తీరం నేడు మూగబోయింది. MPలోని ఖర్గోన్లో 200కు పైగా చిలుకలు, పావురాలు విగతజీవులుగా మారాయి. విషపూరిత ఆహారం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోస్ట్మార్టంలో తేలింది. పర్యాటకులు వేసిన కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజల వల్లే అవి మరణించాయని తెలిసి పర్యావరణ ప్రేమికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలిసి గుండె పగిలిపోయిందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.
News January 3, 2026
సంగారెడ్డి: ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. 2025-26 సంవత్సరానికి 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించుకోగా, 1,225 ఎకరాలు పూర్తయిందని చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.


