News April 24, 2025
పంగులూరులో రోడ్డు ప్రమాదం

బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. గురువారం స్థానికుల వివరాల మేరకు.. ఓ కారు కలకత్తా నుంచి తమిళనాడు వెళ్లే క్రమంలో లారీని క్రాస్ చేస్తుండగా లారీ ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 24, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ 590 ప్లస్ మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులకు కలెక్టర్ అభినందన➤ మాడుగుల మోదకొండమ్మను దర్శించుకున్న జాయింట్ కలెక్టర్➤ ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ➤ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలి:DRO➤ విశాల్ మార్ట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని CITU ధర్నా➤ వడ్డాదిలో అగ్నిప్రమాదం➤ పది ఫలితాల్లో ప్రథమ స్థానంలో కోటవురట్ల మండలం➤ ఉగ్రదాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీలు
News April 24, 2025
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పంజాగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ఎదుట గతంలో ఆయన కుమరుడు యాక్సిడెంట్ చేయగా.. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలతో షకీల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కుమారుడుని తప్పించి, మరొకరిని లొంగిపోయేలా చేశాడు. షకీల్కు సహకరించిన పోలీసులపై వేటుపడగా, కొడుకుతో కలిసి దుబాయ్కి వెళ్ళాడు. ఇటీవల తిరిగి వచ్చాడు.
News April 24, 2025
ఎన్టీఆర్: లిక్కర్ కేసులో చాణక్యకు 14 రోజుల రిమాండ్

లిక్కర్ కేసులో ఏ8 నిందితుడిగా ఉన్న చాణక్యకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. లిక్కర్ ముడుపుల కేసులో చాణక్య పాత్రను విచారించిన సిట్ అధికారులు ఈ కుంభకోణంలో వచ్చిన డబ్బును పలువురికి చేరవేయడంలో అతడు కీలక పాత్ర పోషినట్లు గుర్తించారు. దీంతో చాణక్యను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.