News September 7, 2024

పంచరామ క్షేత్రంలో 7 నుంచి గణపతి నవరాత్రులు

image

కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్ర భీమేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 7 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడో తేదీన ఉదయం 8:30 గంటలకు మహాగణపతి స్వామికి ప్రత్యేక హోమ పూజలు, కలశ పూజలు నిర్వహిస్తామని అన్నారు. స్వామి వారి గ్రామోత్సవం, తదితర ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈవో నీలకంఠం కోరారు.

Similar News

News November 4, 2025

డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం: కలెక్టర్

image

జిల్లాకు చెందిన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, అవసరమైన శిక్షణ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ ఇండియా క్యాంపస్ హెడ్ మెర్లిన్ కలెక్టర్‌ని కలిశారు. సదర్లాండ్ సంస్థ రాజమండ్రిలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు, అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు.

News November 4, 2025

ఓటర్ల సౌకర్యార్థం “Book a Call with BLO” సదుపాయం

image

ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ‘Book a Call with BLO’ నూతన సదుపాయాన్ని జిల్లాలో ఓటర్లు వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వారు NGSP స్టేట్ నోడల్ ఆఫీసర్లతో అక్టోబర్ 24న నిర్వహించిన సమావేశంలో ఓటర్ అనుభవాన్ని మెరుగుపరచడం, ఫెసిలిటేషన్ చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ మాడ్యూల్‌ను అమలులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

News November 4, 2025

ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: డీఈవో

image

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలకు (మార్చి 2026) ఫీజు చెల్లింపు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ వాసుదేవరావు మంగళవారం తెలిపారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి వారి ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి ఫెయిల్ అయినవారు, రెగ్యులర్ పరీక్ష అర్హత కోల్పోయినవారికి ఇది మంచి అవకాశం అని ఆయన వెల్లడించారు.