News August 9, 2024

పంచాయతీలకు నిధులు పెంపు: డిప్యూటీ సీఎం పవన్

image

ఆగష్టు 15న వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25వేలకు పెంచామన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. స్కూళ్లలో ఫ్రీడమ్ ఫైటర్లను సత్కరించాలని, విద్యార్థులకు క్రీడలతో పాటు క్విజ్ తదితర పోటీలు నిర్వహించాలన్నారు.

Similar News

News October 7, 2024

అభివృద్ధిలో మరో ముందడుగు పడింది: MLA సుజనా

image

NDA ప్రభుత్వ పాలనలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని విజయవాడ పశ్చిమ MLA సుజనా ట్వీట్ చేశారు. రూ.25 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని సుజనా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాజధాని నుంచి సమీప జిల్లాలలో ప్రాంతీయ ప్రగతి మరింత పెరగనుందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News October 7, 2024

లక్ష్యాలు అధిగమించి మంచి పేరు తీసుకురండి: కలెక్టర్

image

ప్రభుత్వపరంగా నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి పరిధిలో ప్రతిరోజు లేదా 2రోజులకు ఒకసారి తప్పనిసరిగా వారి కార్యకలాపాలను సమీక్షించు కోవాలన్నారు.

News October 7, 2024

కృష్ణా: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్ &కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.