News April 8, 2025

పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి: ఆకుల రాజేందర్

image

హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ పి.ప్రావిణ్యను కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో కలిసి పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో బదిలీలు చేయడం సరికాదని కోరారు.

Similar News

News April 8, 2025

భువనగిరి: పెరిగిన గ్యాస్ ధరలు.. రూ.1.25 కోట్ల భారం !

image

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సిలిండర్ ప్రస్తుతం రూ.853 ఉండగా పెరిగిన ధరతో రూ.903కు చేరింది. యాదాద్రి జిల్లాలో 2,49,568 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. దీంతో గ్యాస్ వినియోగదారులపై సుమారు రూ. 1.25 కోట్ల భారం పడనుంది. ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే వర్తించనుంది. నిత్యావసరాల ధరలు పెరిగిన వేళ.. గ్యాస్ ధర పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

News April 8, 2025

MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.

News April 8, 2025

పల్నాడు: రిసార్ట్‌లో యువకుడి అనుమానస్పద మృతి

image

పల్నాడు జిల్లా అన్నపర్రుకి చెందిన ఏ.రాశేశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సీఐ రవికుమార్ కథనం మేరకు.. రంపచోడవరం మండలం పెద్దగెద్దాడ శివారున ఉన్న రిసార్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రాజేశ్ కుమార్ ఆదివారం సాయంత్రం టూరిస్ట్‌గా రిసార్ట్‌లో దిగాడని, సోమవారం ఉదయం సిబ్బంది చూసే సరికి శవమై ఉన్నాడని సీఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!