News August 21, 2025
పంజాగుట్ట నిమ్స్లో ప్రపంచ సుందరి

ప్రతష్ఠాత్మక నిమ్స్లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను ప్రపంచ సుందరి ఓపల్ సుచాత పరామర్శించారు. ఇందులో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సదుపాయాలను డైరెక్టర్ డా.బీరప్ప వివరించారు. అనంతరం ఆమె ఆంకాలజీ బ్లాక్లో రోగులకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ వైద్యుడు డా.సదాశివుడు, మీడియా ఇన్ఛార్జి సత్యాగౌడ్ తదితరులు ఉన్నారు.
Similar News
News August 22, 2025
చిరిగిన చొక్కాతోనే తాళికట్టిన చిరు!

చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన మరోసారి వైరలవుతోంది. చిరు పెళ్లిరోజు MSరెడ్డి నిర్మించిన ‘తాతయ్య ప్రేమలీలలు’ చిత్రంలో ఓ పాట షూట్ చేస్తున్నారు. డ్రెస్ మార్చుకునే టైంలేక చిరిగిన చొక్కాతోనే పెళ్లిపీటలపై కూర్చున్నారు. ఎవరో చొక్కా చిరిగింది అనగానే.. ‘షర్ట్ చిరిగితే తాళి కట్టనివ్వరా?’ అని కొంటెగా బదులిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News August 22, 2025
సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపండి: కడప కలెక్టర్

వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలవనరులను సంరక్షించుకునే చర్యలను చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు. వర్షా కాలంలో నీటి నిల్వ కారణంగా ఇసుక సేకరణ సాధ్యం కాదని.. ఇప్పటి నుంచే అవసరమైన మేర ఇసుక నిల్వలను పెంచుకోవాలని సూచించారు.
News August 22, 2025
NLG: విద్యాశాఖలో హాజరు శాతం మెరుగు..!

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగైంది. ముఖ ఆధారిత హాజరు విధానం అమలుతో గైర్హాజరుకు చెక్ పడింది. గతంలో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రాకపోవడం, ఏవో సాకులు చూపి డుమ్మా కొట్టేవారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు హాజరును విద్యాశాఖ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ రోజు ఉదయం పాఠశాలకు రాగానే యాప్లో ఇన్, వదిలి వెళ్లే సమయంలో అవుట్ అని హాజరు నమోదు చేస్తున్నారు.