News February 5, 2025

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య: ASF CI

image

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఆసిఫాబాద్ మండలం బొందగూడలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య(55) పదెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట దిగుబడి రాకపోవడంతో రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News February 27, 2026

కొండగట్టు ఆలయ ఖజానాకు భారీ ఆదాయం

image

కొండగట్టు అంజన్న క్షేత్రంలో తలనీలాల వేలం ద్వారా దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది. గురువారం నిర్వహించిన ఈ వేలంపాట మధ్యాహ్నం నుంచి రాత్రి 10 వరకు కొనసాగింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సాగిన ఉత్కంఠభరిత వేలంలో తొలుత హైదరాబాద్‌కు చెందిన రాజా ఎంటర్‌ప్రైజెస్ రూ.2.70 కోట్లు పాడగా.. అంతిమంగా తణుకుకు చెందిన ఇండియన్ హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.4.44 కోట్లకు టెండర్‌ను దక్కించుకుంది.

News February 27, 2026

సంగారెడ్డి: గురుకులాల్లో ప్రవేశానికి రేపే చివరి తేదీ

image

సంగారెడ్డి జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కో ఆర్డినేటర్ బహుమతి శుక్రవారం తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా మైనార్టీ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. 60 సీట్లు మైనార్టీలకు, 20 సీట్లు నాన్ మైనార్టీలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. నాన్ మైనార్టీలను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.

News February 27, 2026

వరంగల్ మార్కెట్‌లో క్వింటా తేజ మిర్చి రూ.19,000

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం తేజ మిర్చి క్వింటాకు రూ.19,000 అత్యధిక ధర పలికింది. ఈ నెల 20న రూ.18,000 ఉన్న తేజ మిర్చి ధర, ఈ నెల 24న రూ.18,300, 25న రూ.18,400, 26న రూ.18,700 ధర చొప్పున పెరుగుతూ ఈరోజు క్వింటాకు రూ.19,000 ధర పలికింది. వారం రోజుల్లో రూ.వేల ధర పెరగడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తేజ మిర్చి మేలైన రకం కావడంతో ఎగుమతులు పెరిగి ధర పెరుగుతున్నట్లు వ్యాపారులు తెలిపారు.