News October 31, 2025
పంట, రైతుల వివరాలను నమోదు చేయాలి: వ్యవసాయ అధికారి

సాగు చేస్తున్న పంట, రైతుల వివరాలను యాప్లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. బయ్యారం మండలం కొత్తపేటలో వరి సాగు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాప్లో నమోదు చేసుకోవడం వల్ల పంట క్రయ విక్రయాలు సులభం అవుతాయని పేర్కొన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన పంటలను ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేస్తామన్నారు. ఏవో రాజు, ఏఈవోలు నాగరాజు, అఖిల్ పాల్గొన్నారు.
Similar News
News November 1, 2025
MHBD: ఈనెల 16న పంచారామాలకు టూర్: DM

MHBD డిపో నుంచి నవంబర్ 16న టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామాలు యాత్ర టూర్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని DM కళ్యాణి తెలిపారు. డిపో నుంచి 16న 40 సీట్ల డీలక్స్ బస్సు రాత్రి 11 గం.కు వెళ్తుందని, పంచారామాలకు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) చేరుకుని 18న తిరిగి MHBDకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1700, పిల్లలకు రూ.900ఛార్జీ ఉంటుందని, 7396210102, 9948214022 సంప్రదించాలన్నారు.
News November 1, 2025
HNK: ఆకతాయిలు వేధిస్తే షీ టీంకు సమాచారం ఇవ్వండి!

మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత కోరారు. వరంగల్ ఉర్సుగుట్ట వద్ద కార్ షోరూం ఉద్యోగులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టీసేవ్ యాప్తో పాటు షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని, 8712685142కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు ఇన్స్పెక్టర్ సూచించారు.
News November 1, 2025
హనుమకొండ: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 15న హనుమకొండ, పరకాల కోర్టుల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. రాజీపడదగు క్రిమినల్, సివిల్, ఎం.వి.ఏ., వివాహ, కుటుంబ, బ్యాంకు రికవరీ, ఎన్ఐ యాక్ట్ కేసులు పరిష్కరించనున్నారు. కక్షిదారులు తమ న్యాయవాదులతో హాజరై రాజీ కుదుర్చుకోవాలని అధికారులు సూచించారు.


