News January 15, 2026
పండక్కి అల్లుళ్లను ఇంటికి ఎందుకు పిలుస్తారు?

అల్లుడిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆయనకు చేసే మర్యాదలు ఆ నారాయణుడికే చెందుతాయని, దీనివల్ల పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలాగే, పంట చేతికొచ్చే సమయంలో కూతురు, అల్లుడిని పిలిచి విందులు, వస్త్రదానాలతో సత్కరించడం ద్వారా 2 కుటుంబాల మధ్య బంధం బలపడుతుంది. అందుకే కొత్త అల్లుడు సంక్రాంతికి అత్తవారింటికి రావడం మన సంస్కృతిలో మధురమైన సంప్రదాయంగా మారింది.
Similar News
News February 20, 2026
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించే ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో 2024-25, 2025-28 విద్యా సంవత్సరంలో నిరవధికంగా చదివి ఉండాలని తెలిపారు. ఈ నెల 23 నుంచి మార్చి 31వ తేదీలోపు గేట్ వే ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.
News February 20, 2026
బ్రెస్ట్ క్యాన్సర్ను నివారించే ఆహారాలివే..

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల వీటి తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరి, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
News February 20, 2026
అరుదైన విరాళం: వాటర్ పైపుల కోసం 21కిలోల బంగారం!

జపాన్లోని ఒసాకా నగరాభివృద్ధి కోసం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఏకంగా 21 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. సుమారు ₹30 కోట్ల విలువైన ఈ గోల్డ్ను నగరంలోని పాతబడిన వాటర్ సిస్టమ్ను బాగు చేసేందుకు ఉపయోగించాలని కోరారు. 40ఏళ్ల నాటి డ్రైనేజీ, తాగునీటి పైపుల వల్ల వస్తున్న లీకేజీ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ విరాళం అందజేశారు. గతంలోనూ సదరు వ్యక్తి ₹3 లక్షలు డొనేషన్ ఇచ్చినట్లు మేయర్ యొకోహామా వెల్లడించారు.


