News August 14, 2025
పంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలు బంద్

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంసం విక్రయాలు నిషేధిస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా కబేళాలు, మాంసం దుకాణాలు, నాన్ వెజ్ హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే 1965 పురపాలక చట్టం ప్రకారం దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని బేతంచెర్ల కమిషనర్ హరి ప్రసాద్ హెచ్చరించారు.
Similar News
News August 16, 2025
SSMB29 మూవీపై క్రేజీ అప్డేట్!

మహేశ్బాబు-రాజమౌళి కాంబోలో SSMB29 చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేశ్ బర్త్డో రోజు సెట్స్లో ప్రియాంకతో ఉన్న ఫొటో తాజాగా వైరలవుతోంది. ఇప్పుడు మరో అప్డేట్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్లో నైరోబీ, టాంజానియాలో నాలుగో షెడ్యూల్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ప్యాన్ వరల్డ్ రేంజ్లో జక్కన్న ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
News August 16, 2025
పెట్రోల్, డీజిల్ GST పరిధిలోకి రానట్లేనా?

GST <<17418489>>శ్లాబులను<<>> తగ్గిస్తామన్న కేంద్రం ప్రతిపాదనతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ఇష్టపడట్లేదని జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం పెట్రోల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సెస్ వసూలు చేస్తున్నాయి. అన్నీ కలిపి పన్నులు 50% వరకు ఉన్నాయి. ఒకవేళ GSTలోకి తెస్తే 28% శ్లాబులోకి రావొచ్చు.
News August 16, 2025
జనగామ: జాతీయ స్థాయి క్రీడాకారిణికి ప్రశంసా పత్రం!

జాతీయ స్థాయి క్రీడల్లో గెలుపొందుతూ జనగామ జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారిణి కృష్ణవేణి ప్రశంసా పత్రం అందుకుంది. జనగామలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శుక్రవారం అందించారు. స్టే.ఘ. మండలం విశ్వనాధపురానికి చెందిన కృష్ణవేణి జాతీయ క్రీడల్లో విజయం సాధిస్తూ జిల్లాకు గుర్తింపు తీసుకొస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ ప్రశంసా పత్రం అందించారు.