News March 2, 2025

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు: ఏలూరు కలెక్టర్

image

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News November 9, 2025

NIEPVDలో ఉద్యోగాలు

image

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<>NIEPVD<<>>) 14 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28లోపు అప్లై చేసుకోవచ్చు. వీటిలో లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 56ఏళ్లు. లెక్చరర్లకు నెలకు జీతం రూ.60వేలు, ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.45వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: niepvd.nic.in

News November 9, 2025

పూజలో ఏ పూలు వాడాలి? ఏ పూలు వాడొద్దు?

image

పూజకు జిల్లెడ, గన్నేరు, మారేడు, ఉమ్మెత్త, దత్తరేణు, జమ్మి, నల్లకలువలు చాలా శ్రేష్ఠమైనవి. దాసాని, మంకన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ, తోడిలేని పూలు పూజకు పనికిరావు. ఉమ్మెత్త పువ్వుకు పట్టింపు లేదు. మారేడులో లక్ష్మీదేవి, నల్లకలువలో పార్వతీదేవి, కమలంలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే, కొన్ని దేవతలను వాటికి ఇష్టమైన పువ్వులు, ఆకులతోనే పూజించాలి. కొన్ని పువ్వులను కొందరు దేవతలకు అస్సలు వాడకూడదు. <<-se>>#Pooja<<>>

News November 9, 2025

అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి: VZM కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారార్థం రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ వివరాలతో పాటు అర్జీలను సమర్పించాలని సూచించారు. అర్జీల స్థితి కోసం కాల్‌ సెంటర్‌ 1100 ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు.