News March 6, 2025

పకడ్బందీగా పది పరీక్షలు: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేశ్‌ వి పాటిల్ హాజరై పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 12282 మంది, ప్రైవేట్ విద్యార్థులు 686 మంది హాజరవ్వనున్నారు.

Similar News

News December 19, 2025

పల్నాడలో సీఎం పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే

image

సీఎం చంద్రబాబు పనితీరుపై గురువారం నుంచి ఐవీఆర్‌ఎస్ (IVRS) సర్వే నిర్వహిస్తోంది. గత 18 నెలల కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పనితీరుపై అభిప్రాయం ఎలా ఉంది చెప్పడానికి పల్నాడు జిల్లాలో ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. ‘బాగుంది (1)’, ‘పర్వాలేదు (2)’, ‘బాగోలేదు (3)’ నంబర్‌లను నొక్కి తమ అభిప్రాయాన్ని తెలపాలని కోరారు. మరి మీకు కాల్ వచ్చిందా కామెంట్ చేయండి.

News December 19, 2025

పతాక నిధి సేకరణలో గుంటూరుకు ప్రథమ స్థానం

image

సాయుధ దళాల పతాక నిధి సేకరణలో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి రూ. 17,67,363 నిధులు సేకరించినందుకు గానూ కలెక్టర్ తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రశంసా పత్రం అందజేశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ జాబితాలో బాపట్ల ద్వితీయ, తూర్పు గోదావరి జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి.

News December 19, 2025

ములుగు: ప్రకృతి విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

image

ప్రమాదాలు ప్రకృతి విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, సీఎస్ రామకృష్ణారావు సంయుక్తంగా నిర్వహించిన ఈ వీసీలో ములుగు కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. అకస్మాతుగా వచ్చే వరదలు, పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు.