News April 15, 2025

పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: ఎస్పీ

image

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. రెండవ నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.

Similar News

News September 19, 2025

నల్గొండ: జిల్లాలో తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు

image

జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జులై, ఆగస్టు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య వెయ్యికి పైగా చేరాయి. కానీ సెప్టెంబర్లో మాత్రం వందల సంఖ్యలో మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కార్లు, బైక్లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించింది. దీంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు.

News September 19, 2025

SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

image

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News September 19, 2025

29 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

image

విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలపై మున్సిపల్ కమిషనర్ బాలాస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 20 మంది వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు, 9 మందికి మెమోలు జారీ చేసినట్లు వివరించారు. నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.