News January 6, 2026
పచ్చిరొట్టగా పెసర/మినుముతో లాభాలు

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.
Similar News
News February 17, 2026
ముగ్గురు IASలను పెళ్లి చేసుకున్న IAS ఆఫీసర్!

IAS ఆఫీసర్ అవీ ప్రసాద్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, ముగ్గురు భార్యలూ IASలే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ క్యాడర్(2014 బ్యాచ్)కి చెందిన ప్రసాద్ తొలుత IAS రిజు బఫ్నాను పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకొని 2016 బ్యాచ్ ఆఫీసర్ మిషా సింగ్ను వివాహమాడారు. 4ఏళ్ల తర్వాత ఆమె నుంచీ విడిపోయారు. ఈనెల 11న 2017 బ్యాచ్ ఆఫీసర్ అంకిత ధాక్రేను పెళ్లాడారు. వీరంతా ప్రస్తుతం MPలోనే పనిచేస్తున్నారు.
News February 17, 2026
రైళ్ల టాయిలెట్ల శుభ్రతకు ఏఐ టెక్నాలజీ

రైళ్లలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా టాయిలెట్లు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రిజర్వ్, జనరల్ బోగీల్లోనూ గంటకోసారి శుభ్రం చేసేలా AIని వాడుతోంది. తొలిదశలో 100 రైళ్లలో ప్రారంభించినట్లు చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లక్ష్మణ్ తెలిపారు. ‘క్లీనింగ్కు ముందు, తర్వాత ఫొటోలను మొబైల్ యాప్లో సిబ్బంది అప్లోడ్ చేయాలి. వాటిలో ఏ మాత్రం తేడా ఉన్నా AI అప్రమత్తం చేస్తుంది’ అని చెప్పారు.
News February 16, 2026
ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.


