News February 5, 2026
పచ్చి పాలతో గర్భిణికి ఇన్ఫెక్షన్.. శిశువు మృతి

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. గర్భిణీ సమయంలో ఓ మహిళ పచ్చి పాలను తాగేది. అందులోని బాక్టీరియా కారణంగా లిస్టీరియా అనే ఇన్ఫెక్షన్ సోకి నవజాత శిశువు మృతి చెందింది. అన్పాశ్చరైజ్డ్/ వేడి చేయని మిల్క్ తాగితే గర్భిణులు, శిశువులు, పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు గర్భస్రావం అవ్వొచ్చని అంటున్నారు. వేడి చేసిన పాలనే తాగాలని సూచిస్తున్నారు.
Similar News
News February 19, 2026
పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే..

సాధారణంగానే పిల్లలు కుదురుగా ఉండరు. అదేకాకుండా ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలతో పాటు పెద్దల్లో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. పిల్లలు చదివేటపుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వారితో కూర్చొని వార్తలు, పుస్తకాలు చదవాలి. దీంతో పిల్లలకు అది అలవాటవుతుంది. అటెన్షన్ బ్రేక్లు ఇవ్వాలి. టైం టేబుల్ తయారుచేసి ఫాలో అవ్వాలి. వారి దృష్టి మరల్చే వస్తువులు దూరంగా ఉంచాలి.
News February 19, 2026
విశాఖలో AI హబ్: సుందర్ పిచాయ్

ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్లో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో గూగుల్ AI హబ్లను ఏర్పాటు చేస్తోందని కంపెనీ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. మానవాళికి AI చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ AIని చాలా వేగంగా అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీని అందరికీ చేర్చడమే మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
News February 19, 2026
163 ఏళ్ల తర్వాత ఇలా.. మళ్లీ 2189లోనే!

ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల పండుగలు ఒకే సమయంలో రావడం చాలా అరుదు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్, క్రైస్తవ మతంలో ఈస్టర్ పండుగకు ముందు వచ్చే లెంట్, చైనీస్ ‘లూనార్ న్యూఇయర్’లు 1863లో 24 గంటల వ్యవధిలోనే ప్రారంభమయ్యాయి. మళ్లీ 163 ఏళ్ల తర్వాత 2026లో ఈనెల 17-18న ఇది ఆవిష్కృతమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మళ్లీ ఇలాంటి వింతను చూడాలంటే 2189 వరకు వేచి చూడాలి.


