News April 15, 2024

పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే పథకాలు: బొత్స ఝాన్సీ

image

పేదలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్‌తో కలిసి కొత్తపాలెంలో సోమవారం ప్రచారం చేశారు. పొరపాటున చంద్రబాబు వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని, అప్పుడు పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే పథకాలు అందిస్తారన్నారు. పేదల కోసం పాటుపడుతున్న జగన్‌ను గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు.

Similar News

News October 7, 2025

విశాఖలో రేషన్ డిపోలో బయటపడిన అవకతవకలు

image

విశాఖలోని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు తనిఖీలు నిర్వహించారు. 294వ నంబర్ రేషన్ డిపోలో స్టాక్ లేని కారణంగా మేమె జారీ చేయాలని, 303వ నంబర్ డిపోలో పరిశుభ్రత పాటించాలన్నారు. 606, 604,590వ నంబర్ డిపోల్లో సమయపాలన పాటించకపోవడం, స్టాక్ ఇవ్వకపోవడం గమనించారు. అగనంపూడి జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకంలో గుడ్లు బరువు తక్కువగా ఉండడంతో హెచ్ఎంను హెచ్చరించారు.

News October 7, 2025

వాల్మీకి జీవిత విశేషాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాలి: కలెక్టర్

image

మ‌హ‌ర్షి వాల్మీకి జీవిత విశేషాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అన్నారు. వాల్మీకి జ‌యంతిని పుర‌స్క‌రించుకొని విశాఖ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో కలెక్టరేట్‌లో వాల్మీకి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. మాన‌వ జీవితానికి అనువైన విధంగా వాల్మీకి రామాయణాన్ని ర‌చించి ఎన్నో విష‌యాల‌పై మ‌హత్త‌ర సందేశాన్ని అందించార‌ని గుర్తు చేశారు.

News October 7, 2025

విశాఖలో ప్రారంభమైన రక్త మార్పిడి సేవలపై జాతీయ వర్క్‌షాప్

image

ఏపీ రక్త మార్పిడి సేవల విభాగం, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “రక్తం,రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం” అంశంపై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ విశాఖలో మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జెనరల్ డా.సునీత శర్మ, NBTC డైరెక్టర్ డా.కృష్ణ కుమార్, WHO ప్రతినిధి డా.మాధుర్ గుప్తా పాల్గొన్నారు.