News July 10, 2025
పటాన్చెరులో స్కూల్ బస్సు దగ్ధం

సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులో మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే విద్యార్థులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పాక్షికంగా కాలిపోగా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News July 10, 2025
KNR: సివిల్స్ ఉచిత శిక్షణకు 12న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్

సివిల్స్ ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 12న నిర్వహించనున్నామని కరీంనగర్ జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ ఈరోజు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 0878-2268686 నంబర్కు కాల్ చేయాలని సూచించారు.
News July 10, 2025
జగిత్యాల: సివిల్స్ ఉచిత శిక్షణకు 12న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్

సివిల్స్ ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 12న నిర్వహించనున్నామని కరీంనగర్ జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ ఈరోజు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 0878-2268686 నంబర్కు కాల్ చేయాలని సూచించారు.
News July 10, 2025
కావలి: గోడ కూలి బేల్దారి మృతి

కావలిలో గోడ కూలి బేల్దారి మృతి చెందాడు. డ్రైనేజీ కాలువ నిర్మించేందుకు తవ్వుతుండగా పక్కనేఉన్న గోడ కూలి మృతి చెందాడు. మృతుడు బోగోలు మండలం సాంబశివపురం తాతా వెంకయ్యగా గ్రామస్థులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బేల్దారి మేస్త్రిలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.