News April 6, 2024
పటాన్ చెరు: కారు రన్నింగ్లో ఉండగా రివర్స్ గేర్.. యువకుడి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్చెరు PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శాంతినగర్కు చెందిన భగీరథ కుమార్(19), అతడి స్నేహితుడు నిఖిల్ కుమార్తో కలిసి శుక్రవారం ముత్తంగి పరిధిలో హోటల్కి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు రన్నింగ్లో ఉండగా నిఖిల్ కుమార్ రివర్స్ గేర్ వేయడంతో చెట్టును ఢీకొంది. భగీరథకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News December 23, 2025
మెదక్ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షుడిగా వేణు

మెదక్ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షుడిగా వేణు, కార్యదర్శిగా కరణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా కార్యాలయంలో ఎన్నికలను తెలంగాణ జనరల్ సెక్రటరీ కోరడాల వెంకటేశ్వర్లు, డిస్కమ్ రాష్ట్ర నాయకుల సమక్షంలో నిర్వహించారు. వేణు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
News December 23, 2025
మెదక్: సీనియర్ ఎస్పీగా శ్రీనివాస రావుకు ప్రమోషన్

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకు సీనియర్ ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ 2013 బ్యాచ్కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులను 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఐపీఎస్(వేతన) నియమాలు, 2016 ప్రకారం పే మ్యాట్రిక్స్లోని లెవెల్ 13, సెలక్షన్ గ్రేడ్కు పదోన్నతి కోసం ఎంప్యానెల్ చేశారు. ఈ క్రమంలో డీజీపీకి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
News December 23, 2025
MDK: నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబం సర్పంచ్

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన ఒకే కుటుంబం 4 పర్యాయాలుగా సర్పంచ్ పదవికి ఎన్నికయ్యారు. 2025లో జరిగిన ఎన్నికల్లో శివగోని పెంటా గౌడ్ సర్పంచిగా గెలుపొందారు. 2006లో పెంట గౌడ్ తమ్ముడు రాజాగౌడ్, ఆ తర్వాత జరిగిన 2012, 2018లో జరిగిన ఎన్నికల్లో పెంటాగౌడ్ తల్లి సుగుణమ్మ రెండు పర్యాయాలు సర్పంచ్ పనిచేశారు. రాజాగౌడ్ భార్య ఎంపీటీసీగా సేవలందించారు.


