News April 25, 2024
పట్టభద్రుల ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ప్రకటించారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Similar News
News October 2, 2024
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు, ఏసీపీలు సీఐలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ మార్గంలోనే నేటి యువత ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
News October 2, 2024
WGL: రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణి
రేపటి నుంచి ఉచిత చెప పిల్లల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మత్సశాఖ సంచాలకులు అల ప్రియాంక తెలిపారు. తొలి విడతగా తొమ్మిది జిల్లాలు హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాలలో చేపపిల్లల పంపిణీని ప్రారంభిస్తారు. రెండో విడతలో మిగిలిన జిల్లాల్లో ఈనెల ఏడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని ప్రియాంక తెలిపారు.
News October 2, 2024
వరంగల్: మరికాసేపట్లో DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్
వరంగల్ జిల్లాలో DSCలో SGT అభ్యర్థులు 1 :3నిష్పత్తిలో 435 మంది, SGT ఉర్దూలో 25 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అర్హత సాధించారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు GTలో 270 మంది, SGT ఉర్దూలో 25 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో, రెండు సెట్లు గెజిటెడ్ తప్పనిసరన్నారు. వివరాలకు www.deowarangal.net సంప్రదించాలన్నారు.