News March 28, 2025

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఘన సత్కారం

image

శాసనమండలిలో పదవి కాలం పూర్తి చేసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి గతంలో జీవన్ రెడ్డి గెలుపొందారు. ఈనెల 29న పదవీకాలం ముగుస్తుండడంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జీవన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.

Similar News

News September 19, 2025

ఆసిఫాబాద్‌లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

image

ఆసిఫాబాద్ మండలం సామెల తుంపల్లికు చెందిన ఆత్రం వర్ష అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఈరోజు తెలిపారు. ఈనెల 16న తన పుట్టింటి నుంచి వచ్చిన ఆమె తుంపల్లి ఆటో స్టాండ్ వద్ద ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వర్ష భర్త భగవంత్ రావు గురువారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

News September 19, 2025

VZM: స్పీకర్‌తో మహిళ ప్రజా ప్రతినిధుల భేటీ

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశాల ప్రాధాన్యం, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై వారు చర్చించారు. సభా కార్యక్రమాలు విజయవంతంగా సాగేలా సహకారం అందిస్తామని తెలిపారు.

News September 19, 2025

5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.