News March 28, 2025
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఘన సత్కారం

శాసనమండలిలో పదవి కాలం పూర్తి చేసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి గతంలో జీవన్ రెడ్డి గెలుపొందారు. ఈనెల 29న పదవీకాలం ముగుస్తుండడంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జీవన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.
Similar News
News February 28, 2026
విశాఖ: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీ

విశాఖ కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు సందర్శిచారు. ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు-2026 అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గవర్నర్ ఆమోదం వెంటనే చట్టమవుతుందని తెలిపారు. జైళ్ల అభివృద్ధికి రూ.102 కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.53 కోట్లతో బ్యారక్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు రోజుల శిక్షణ ముగింపులో అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు.
News February 28, 2026
భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

చారిత్రక భద్రకాళి ఆలయంలో ఉత్తరాయణం శుక్లపక్షం సందర్భంగా అర్చకుడు శేషు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యార్చన, షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
News February 28, 2026
అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త

TG: హైదరాబాద్ నుంచి అరుణాచలం(తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నాంపల్లి-కన్యాకుమారి(07229/07230) వీక్లీ ఎక్స్ప్రెస్ను ఇకపై రెగ్యులర్(17069/17070) సర్వీస్గా నడపనున్నట్లు తెలిపింది. అలాగే కాచిగూడ-మధురై వీక్లీ ఎక్స్ప్రెస్(17615/17616)ను కూడా రోజూ నడుపుతామని పేర్కొంది. దీన్ని తూత్తుకుడి వరకు పొడిగించింది.


