News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. కొవ్వూరు, 2012(ఉప), 2019 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.

Similar News

News February 22, 2026

ప.గో: EX MLA పేరుతో INSTA అకౌంట్.. నమ్మితే అంతే..!

image

నరసాపురం మాజీ MLA కొత్తపల్లి జానకీ రామ్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఖాతాల ద్వారా అభిమానులకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, అనుచరులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ డబ్బులు పంపి మోసపోవద్దని జానకీ రామ్ కోరారు.

News February 22, 2026

భీమవరం: అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

image

కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీగా ఉండి, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలపై ప్రస్తుతం ప.గో.జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

News February 22, 2026

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

image

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.