News January 24, 2025
పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఐఈఓ

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈఓ అంజయ్య అన్నారు. గురువారం పానగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో చదువుపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పరీక్షలు ముగిసే వరకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలన్నారు.
Similar News
News September 18, 2025
VJA: GST ఎఫెక్ట్.. ఈ నెల 22 నుంచి LED టీవీలు, ACలపై భారీ ఆఫర్లు

GST తగ్గింపుతో ఈ నెల 22 నుంచి LED టీవీలు, డిష్వాషర్లు, ACలపై భారీ ఆఫర్లు ప్రకటించామని విజయవాడ సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కరమూర్తి తెలిపారు. GST తగ్గింపు, దసరా ఆఫర్స్తో 22 నుంచి LED టీవీలు, డిష్వాషర్లు, ACలు, వాషింగ్ మెషిన్స్, ల్యాప్ట్యాప్స్, మొబైల్స్ డిస్కౌంట్లతో, EMI, ఫైనాన్స్ కొనుగోలుపై 15% క్యాష్బ్యాక్, స్క్రాచ్ కార్డు ఆఫర్స్ గృహోపకరణాలు సోనోవిజన్లో లభిస్తాయన్నారు.
News September 18, 2025
మంచిర్యాల జిల్లాలో 12.8 మి.మీ. వర్షపాతం నమోదు

మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 12.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా కాసిపేట మండలంలో 64.2 మి.మీ నమోదైంది. జన్నారం 0.4, దండేపల్లి 2.2, లక్షెట్టిపేట3.0, హాజీపూర్ 6.4,తాండూర్ 34.6, భీమిని 2.8, కన్నేపల్లి1.4, వేమనపల్లి 0.0, నెన్నల 1.0, బెల్లంపల్లి 32.0, మందమర్రి 17.2, మంచిర్యాల 29.4, నస్పూర్ 15.4, జైపూర్ 1.6, భీమారం 20.4, చెన్నూర్ 00, కోటపల్లి 00 మి.మీ. వర్షం కురిసింది.
News September 18, 2025
ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ బదిలీ

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆయన్ను ములుగు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవోగా) నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ములుగు హెడ్ క్వార్టర్కు బదిలీ అయ్యారు. కాగా ప్రస్తుతం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం సబ్ డివిజనల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు బదిలీపై ఆయన ములుగు వెళ్లనున్నారు.