News September 8, 2025
పత్తి కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీతో సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. పత్తి మార్కెటింగ్ సీజన్ 2025-26 కోసం జిల్లా సగటు దిగుబడిని ఖచ్చితంగా అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News September 10, 2025
ఆదిలాబాద్: అధికారులతో కలెక్టర్ సమీక్ష

ఎండోన్మెంట్ భూములు, భూ భారతిలో నమోదైన సాదాబైనామాలు, అసైన్డ్ ల్యాండ్ దరఖాస్తులపై గూగుల్ మీట్ ద్వారా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ మండలాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, భూపరమైన వివాదాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. భూ భారతి అప్లికేషన్లో నమోదవుతున్న సాదా బైనామాలు, వాటి పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
News September 9, 2025
ఉట్నూర్: ‘ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం’

ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 50 సీసీ టీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ కలిసి ప్రారంభించారు. నిష్ణాతులైన సిబ్బంది ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తామని తెలిపారు. రాత్రి సమయంలోనూ దృశ్యాలు కనిపిస్తాయన్నారు.
News September 9, 2025
రేపు చాకలి ఐలమ్మ వర్ధంతి: ఆదిలాబాద్ కలెక్టర్

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఈనెల 10న అధికారికంగా నిర్వహించనున్నామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కావున రిమ్స్ ఆసుపత్రి ఎదుట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించే వర్ధంతి కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీసీ, రజక సంఘాల నాయకులు, ప్రజలు హాజరవ్వాలని కోరారు.