News February 19, 2025
పదవ తరగతి పరీక్షలకు 26497 విద్యార్థులు: కలెక్టర్

పల్నాడులో 2025 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 26,497 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. విద్యాశాఖ అధికారులతో మంగళవారం 128 కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలన్నారు. విద్యాశాఖ అధికారులు తహశీల్దార్లతో సమన్వయం చేసుకొని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా ఉండాలన్నారు. డీఈవో చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
భద్రకాళి ఆలయంలో హుండీల లెక్కింపు

వరంగల్ భద్రకాళి ఆలయంలో హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో ఆలయానికి రూ. 61,58,999 ఆదాయం లభించింది. నగదుతో పాటు 316 యూఎస్ఏ డాలర్లు, 15 యూఏఈ దిరమ్స్తో పాటు ఇతర విదేశీ కరెన్సీ కూడా వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.
News September 16, 2025
కరీంనగర్: ‘చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలి’

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలని, కరీంనగర్ జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం మత్స్య శాఖ కమిషనర్ ఐఏఎస్ నిఖిలకు కరీంనగర్ జిల్లా మత్స్యకారులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మత్స్యశాఖ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు.
News September 16, 2025
OTTలోకి ‘వార్-2’ వచ్చేది అప్పుడేనా?

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఓటీటీ(నెట్ఫ్లిక్స్)లో రిలీజయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం 6-8 వారాల్లో సినిమాలు OTTలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.