News March 27, 2024

పది పరీక్షలు.. 77 మంది గైర్హాజరు

image

ఎస్సెస్సీ పరీక్షకు మంగళవారం 77మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఖమ్మం జిల్లా డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. మొత్తం 16,779 మంది విద్యార్థులకు గాను 16,702 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌, జిల్లా పరిశీలకుడు , అసిస్టెంట్‌ కమిషనర్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను పలు కేంద్రాలను తనిఖీ చేశాయని ఆయన తెలిపారు.

Similar News

News July 8, 2024

ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు

image

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.

News July 8, 2024

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

News July 8, 2024

ఆదాయం దండిగా వస్తున్నా.. ఇంకా అద్దె భవనాల్లోనే!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినెల పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు సొంత స్థలాలు ఉన్నా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సొంత భవనాలు సమకూరుతాయని, ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.