News March 27, 2024
పది పరీక్షలు.. 77 మంది గైర్హాజరు

ఎస్సెస్సీ పరీక్షకు మంగళవారం 77మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఖమ్మం జిల్లా డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. మొత్తం 16,779 మంది విద్యార్థులకు గాను 16,702 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, జిల్లా పరిశీలకుడు , అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను పలు కేంద్రాలను తనిఖీ చేశాయని ఆయన తెలిపారు.
Similar News
News April 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన∆} వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం సంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News April 18, 2025
KMM: స్పెషల్ డ్రైవ్.. మైనర్లపై 15 కేసులు: ఏసీపీ

మైనర్ డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రాఫిక్ పోలీసులు ఏడు రోజుల్లో 15 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విద్యార్థులు వేసవి సెలవులు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు వాహన తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. పాఠశాలలకు సెలవుల సమయంలో తల్లిదండ్రులు వారి పిల్లల కదలికలపై దృష్టి పెట్టాలని ఏసీపీ పేర్కొన్నారు.
News April 18, 2025
ఖమ్మం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఖమ్మం జిల్లాకు ఖమ్మం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఖమ్మం నగర మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచి మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలించేవారని చరిత్ర చెబుతుంది. ఉర్దూ భాషలో ఖమ్మం అంటే స్తంభం అని అర్ధం. అలాగే నరసింహస్వామి పేరు మీద ఈ పేరు వచ్చిందనే వాదన ఉంది. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రాంతాన్ని ‘ఖమ్మం మెట్టు’ అని పిలిచేవారనే మరో వాదన ఉంది. దీంతో ఖమ్మంకు అలా పేరు వచ్చిందని చెబుతున్నారు.